పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి
NEWS Nov 26,2024 12:37 pm
పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని, ప్రజలు స్వచ్ఛతపై దృష్టి పెట్టి జగిత్యాల మున్సిపాలిటీని పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. కమిషనర్ చిరంజీవి, శానిటరి ఇన్స్పెక్టర్ బాలె మారుతి ఉన్నారు.