భూముల నష్ట పరిహారంపై గ్రామ సభలు
NEWS Nov 26,2024 12:37 pm
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్, మూలరాంపూర్ గ్రామాల్లో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ గ్రామ సభలు నిర్వహించారు. మంగళవారం గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్ మార్ట్ బ్యారేజీ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భూములకు నష్టపరిహారం విషయం రైతులతో చర్చించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం ఇస్తామని, రైతులు సహకరించాలని ఆర్డీవో కోరారు.