కోదండ రామాలయ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే
NEWS Nov 25,2024 03:39 pm
రాజకీయాలకు అతీతంగా మెట్పల్లి పట్టణంలోని కోదండ రామాలయం అభివృద్ధి జరగాలని కోదండ రామాలయ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం ఎస్సారెస్పీ అధికారులు, మెట్పల్లి పెద్దలతో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రజల ఆకాంక్షల మేరకు ఆలయాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేరు ప్రతిష్ఠలకు, రాగద్వేషాలకు, రాజకీయాలకతీతంగా ఆలయాలు అందుబాటులో ఉండాలన్నారు.