ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల ధర్నా
NEWS Nov 25,2024 03:32 pm
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే ఈ 5 డిమాండ్లను 90 % బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ పేద ప్రజలకు అందించాలని నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ, అరుణ్, తిరుపతి,ఉపేంద్ర, గంగరాజం, కోటేశ్, ప్రణీత్, అనుదీప్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.