2 గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు
NEWS Nov 25,2024 03:29 pm
మేడిపల్లి మండలం కొండాపూర్, గోవిందారం గ్రామాల్లో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రెండు గ్రామాల్లోని 127 గేదెలకు కృత్రిమ గర్భాధారణ చికిత్సలు అందించారు. అనంతరం పశువుల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఈవో ఎస్పీ రెడ్డి, వైద్యులు రాజేందర్ రెడ్డి, వెన్నెల, గోపాలమిత్రలు పాల్గొన్నారు.