మంత్రి శ్రీధర్ బాబును కలిసిన గోవర్ధన్
NEWS Nov 25,2024 03:29 pm
మెట్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్ టీ-పీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావుతో కలిసి సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో వ్యవసాయ కమిటీ ఛైర్మన్ అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యంరెడ్డి, కుతుబుద్దిన్ పాష, రాకేశ్, మారుతి, నవీన్, గిరి తదితరులున్నారు.