విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఎన్నిక
NEWS Nov 25,2024 11:01 am
నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా రాకేశ్, కోశాధికారిగా సత్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని ఎన్నికైన సభ్యులు అన్నారు.