PSలో అంబేడ్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు
NEWS Nov 25,2024 10:58 am
కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అంబేడ్కర్ (మాల) మండల నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో పోలీస్ శాఖ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని ఫిర్యాదు చేసినట్టు నాయకులు బత్తుల నరేశ్, తలారి మోహన్, కోట శంకర్, సిరికొండ రాములు, నర్సయ్య తెలిపారు.