శివాలయం గుడికి ఎమ్మెల్యే శంకుస్థాపన
NEWS Nov 25,2024 09:29 am
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవతో టీటీడీ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా సోమవారం శివాలయ గుడి నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేసారు. నిధుల మంజూరు కి కృషి చేసిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.