నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
NEWS Nov 25,2024 09:40 am
నిర్మల్ జిల్లా: కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 26న నిర్వహించే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. పట్టణంలో నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.