గ్రామపంచాయతీ భవనంకు భూమి పూజ
NEWS Nov 25,2024 09:34 am
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం సోమవారం భూమి పూజ చేశారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.