నూకపల్లి రైతు వేదిక దుస్థితి
NEWS Nov 25,2024 07:12 am
మల్యాల మండలం నూకపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక నిరుపయోగంగా మారింది. రోడ్డు అవతలి గ్రామాల రైతుల ప్రయోజనం కోసం నిర్మించిన రైతు వేదిక నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో భవనం చుట్టూ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగి, కనీసం అందులోకి వెళ్లడానికి కూడా దారి లేకుండా తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.24 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.