క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం
NEWS Nov 24,2024 12:38 pm
మాసాయిపేటలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు సమావేశంలో మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్, మెదక్, మంచిర్యాల క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. క్రీడల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.