రాజ్యాంగాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడానికి రాజ్యాంగ పఠనం చర్చావేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు .ఆదివారం ఉదయం రాజమండ్రి లోని స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ పఠనం పై అవగాహన కరపత్రాన్ని ఉండవల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ రాంబాబును అభినందించారు.