మృతుని కుటుంబానికి సాయం
NEWS Nov 24,2024 12:37 pm
మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ఇటీవల మేర మహేష్ అనారోగ్యంతో కన్నుమూశాడు. మృతుని కుటుంబం నిరుపేద కావడంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు సురిగి శ్రీనివాస్ గౌడ్, గడ్డం రాజేష్, సన్నీ, మణిదీప్, ప్రశాంత్ పాల్గొన్నారు.