కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని శిథిలావస్థలో ఉన్న భవనంలో నిర్వహించడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. భవనంపై పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అంగన్వాడి కేంద్రానికి కొత్తగా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.