మార్కెట్ కమిటీ డైరెక్టర్కు సన్మానం
NEWS Nov 24,2024 10:42 am
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన వాకిటి రాజారెడ్డి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా గ్రామ నాయకులు సన్మానించారు. రైతులకు సేవలు అందించేందుకు గ్రామానికి చెందిన నాయకుడికి డైరెక్టర్ పదవి రావడం సంతోషంగా ఉందని పలువురు కొనియాడారు. అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూన సులోచన, నాయకులు కూన అశోక్, గోపిడి మధు పాల్గొన్నారు.