హనుమకొండ నగరంలోని హంటర్ ప్రాంతంలో కొలువై ఉన్న దోనగుట్ట శ్రీ త్రివేదాత్రి సంతోషాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.