మల్లాపూర్లో బీజేపీ నాయకుల సంబరాలు
NEWS Nov 23,2024 04:36 pm
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు మహాయుతి కూటమి ఘన విజయం సాధించినందుకు మల్లాపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాపాసులు కాల్చి, మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని మహారాష్ట్ర ప్రజలు మరోసారి నిరూపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి, గడ్డం నర్సిరెడ్డి, లవంగ శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.