భీమేశ్వరాలయంలో గుంటూరు అదనపు జడ్జి పూజలు
NEWS Nov 23,2024 06:07 pm
పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ భీమేశ్వరాలయంలో గుంటూరు జిల్లా అదనపు జడ్జి శరత్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. శనివారం సాయంత్రం ఆలయానికి విచ్చేసిన జడ్జి దంపతులకు ఆలయ అధికారి బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అదనపు జడ్జి దంపతులు భీమేశ్వర స్వామిని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.