మల్యాలలో బీజేపీ సంబరాలు
NEWS Nov 23,2024 12:57 pm
శనివారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ కూటమి మహాయుతి ఘన విజయం సాధించిన సందర్భంగా మల్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజారులో బీజేపీ మండల నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బింగి వేణు, వెంకట స్వామి యాదవ్, గాజుల మల్లేశం, జనగాం రాములు, రాజ్ కుమార్, రవి, గౌతమ్, ఆనంద్, మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.