జగిత్యాలలో బీజేపీ సంబరాలు
NEWS Nov 23,2024 12:56 pm
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు శనివారం జగిత్యాల చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి భోగ శ్రావణి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందన్నారు.