వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన బోగ శ్రావణి
NEWS Nov 23,2024 12:54 pm
రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో జగిత్యాల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను బీజేపీ నాయకురాలు డా. బోగ శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వాలీబాల్ ఆడారు. తల్లిదండ్రులు పిల్లల్ని చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రొత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్, క్రీడాకారులున్నారు.