సబ్ స్టేషన్ కొరకు స్థల పరిశీలన
NEWS Nov 23,2024 12:59 pm
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సబ్ స్టేషన్ 33 బై 11 కేవీ విద్యుత్ కోసం స్థల పరిశీలన చేశారు డిఈ గోపికృష్ణ. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. కథలాపూర్ సబ్స్టేషన్ నుంచి కరెంటు వస్తుందని, అక్కడ ఓవర్లోడ్ అవుతుందని గుర్తించి కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీని కొరకు శనివారం స్థల పరిశీలన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి రఘుపతి ఏఈ మునిధర్ రెడ్డి, ఏఈ దివాకర్ రావు, లైన్మేన్ వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు.