పశువైద్య అధికారులకు సన్మానం
NEWS Nov 23,2024 12:53 pm
జగిత్యాల పశువైద్య, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో నూతనంగా జిల్లాకు నియమించినన పశువైద్య అధికారులకు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డా. యస్.ఎల్ మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ భోనగిరి నరేష్ పశువైద్యులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్ రెడ్డి, పశువైద్య అధికారులు పాల్గొన్నారు.