కిరాణా షాపులపై అధికారుల దాడులు
NEWS Nov 23,2024 12:17 pm
మున్సిపల్ కమీషనర్ మోహన్ ఆదేశాలతో మెట్పల్లి పట్టణంలోని పలు కిరాణా షాపులపై శనివారం మున్సిపల్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లను వాడుతున్న వారికి జరిమానాలను విధించారు. ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, జ్యూట్ బ్యాగులను మాత్రమే వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు, ముజీబ్ తదితరులున్నారు.