వాడపల్లి వెంకన్నకు 41 లక్షలు ఆదాయం
NEWS Nov 23,2024 12:18 pm
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి శనివారం రూ. 41,63,176 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.