విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
NEWS Nov 23,2024 06:05 pm
కేజీబీవి విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు. మామడ మండల కేజీబీవి పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె సందర్శించారు. ముందుగా తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రభుత్వ వసతి గృహల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.