మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 229 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి( కాంగ్రెస్ కూటమి) 54 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది మహాయుతి కూటమి.