గ్రామాల్లో పర్యటించిన మెట్పల్లి ఆర్డీవో
NEWS Nov 23,2024 10:39 am
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ శనివారం పర్యటించారు. గ్రామాల్లో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. దాన్యం తూకం త్వరగా వేయాలని నిర్వాహకులను ఆదేశించారు.