బీజేపీ కార్యాలయంలో విజయ సంబరాలు
NEWS Nov 23,2024 10:47 am
నిర్మల్ జిల్లా: మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం నిర్మల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.