ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న కానిస్టేబుల్
NEWS Nov 23,2024 07:14 am
నర్సాపూర్ జి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కృష్ణ చౌహన్ జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్ఫూర్తితో పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. పాఠశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ముందుంటామని అన్నారు.