మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి
NEWS Nov 23,2024 07:13 am
మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని దిలావర్పూర్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ అన్నారు. శనివారం కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఇందులో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.