గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు
NEWS Nov 23,2024 04:47 am
మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం , మల్లాపూర్, మండలాలలో గంజాయి సరఫరా చేసినా, విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈజీ మనీకి అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించే నిందితులు ఎవరైనా సరే చట్టప్రకారం శిక్షార్హులన్నారు,తల్లిదండ్రులు తమ పిల్లలు అర్ధరాత్రి వరకు,ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు.