ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్న సీఐ
NEWS Nov 23,2024 04:36 am
మెట్ పల్లి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి. పట్టణ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి బస్ డిపో వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కథలాపూర్ శివారు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను లారీ లో నిజామాబాద్, పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీస్ లు స్టేషన్ కు లారీని తరలించి డ్రైవర్,ఓనర్ పై కేసు నమోదు చేసిన సీఐ నిరంజన్ రెడ్డి.