మోదీకి అరుదైన గౌరవం!
NEWS Nov 22,2024 05:25 pm
ప్రధాని మోదీ 6 రోజుల విదేశీ పర్యటన ముగిసింది. ముఖ్య నేతలతో 31 ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. బ్రెజిల్లో సింగపూర్, దక్షిణ కొరియా, ఈజిప్ట్, అమెరికా, స్పెయిన్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గయానా పర్యటనలో ఆయన 9 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. 56 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానా సందర్శించారు. అక్కడ మోదీ గయానా దేశ అత్యున్నత పౌర గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు అందుకున్నారు