మొక్కలను సంరక్షించాలి కమిషనర్
NEWS Nov 22,2024 11:45 am
ప్రతిరోజు మొక్కలకు నీరు పడుతూ వాటిని సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెట్పల్లిలోని నేషనల్ హైవే రోడ్డు డివైడర్పై నాటిన మొక్కలను డిజైన్ కట్టింగ్ చేస్తుండగా ఆయన పరిశీలించారు. డివైడర్పై పూల మొక్కలు నాటాలని సూచించారు. ఆయన వెంట ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.