వాలంటీర్లను కొనసాగించాలని ధర్నా
NEWS Nov 22,2024 09:58 am
అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి, 10 వేలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.