28న AIPSU ఛలో పార్లమెంట్
NEWS Nov 22,2024 09:58 am
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) ఆధ్వర్యంలో నిర్మల్లో ఛలో పార్లమెంట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చాకటి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 28న విద్యా, ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడాన్ని, ప్రజా ప్రభుత్వ విద్య రంగాన్ని కాపాడుకోవాలంటే కొఠారి కమిషన్ ప్రకారం మొత్తం కేంద్ర బడ్జెట్లో విద్య రంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని, ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ను ముట్టడిస్తున్నట్లు తెలిపారు.