నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..
NEWS Nov 22,2024 09:45 am
వైవాహిక జీవితంలో మనస్పర్ధలు సహజమని, బలమైన కుటుంబం ద్వారానే సమాజంలో నేరాలను నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ద్వారా విడిపోయిన జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, భరోసా కేంద్రం ఇప్పటివరకు సుమారు 176 మంది జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా 52 జంటలు తిరిగి ఏకం అయ్యాయి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి తిరిగి ఏకమైన జంటలను జిల్లా ఎస్పీ జానకి శర్మిల అభినందించారు.