ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలు
NEWS Nov 22,2024 09:39 am
మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జలపతి రెడ్డి, పుండ్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.