క్రీడోత్సవాలను ప్రారంభించిన అదనపు కలెక్టర్
NEWS Nov 22,2024 09:41 am
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్మల్ పట్టణం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో రాణించిన దివ్యాంగ క్రీడాకారులకు రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు స్ఫూర్తితో పోటీలో పాల్గొనాలని కోరారు. ఇందులో ఆయా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు