రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
NEWS Nov 22,2024 09:42 am
మల్లాపూర్: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 12 రన్నింగ్ పోటీల్లో చవిడికారి గణేష్ 400 మీటర్ల పరుగు పందెం 16.01 సెకండ్ల లో పూర్తి చేసి ప్రథమ స్థానం, అండర్ 12 జావెలిన్ త్రో విభాగంలో బోదాసు హరీష్ 17.85 మీటర్లు విసిరి మొదటి స్థానం సాధించారు. వీరిని పలువురు అభినందించారు.