వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
NEWS Nov 22,2024 08:59 am
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు.రైతులు వరి ధాన్యంలో తేమశాతం 17% వచ్చేవరకు ఆరబెట్టాలని తెలిపారు కార్యక్రమం లో ఆర్డీవో ఎమ్మార్వో ఆర్ఐ తదితరులు ఉన్నారు