సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నోటీసులు
NEWS Nov 22,2024 09:06 am
రాష్ట్ర ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 15 రోజులలో తమను ప్రభుత్వం చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రత్నం, గజేందర్ సింగ్, సుధాకర్, కావ్య తదితరులు పాల్గొన్నారు.