విద్యార్థులతో కలిసి భోజనం చేసిన RDO
NEWS Nov 22,2024 09:01 am
మల్లాపూర్లో మండల కేంద్రంలో గల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత తీరు, పాఠశాల విద్య ప్రమాణల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఉపాధ్యయులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ వీర్ సింగ్, ఎంపీడీఓ జగదీశ్, ఆర్ఐ సురేష్ తదితరులు వున్నారు.