రాష్ట్రపతితో విద్యాసాగర్ రావు భేటీ
NEWS Nov 22,2024 08:10 am
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాజ్భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ గిరిజన సమస్యలు, వాటి పరిష్కారాలపై విద్యాసాగర్ రావు ప్రచురించిన పుస్తకాన్ని రాష్ట్రపతి ముర్ముకు అందించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో చెన్నమనేని విద్యాసాగర్రావు పలు అంశాలపై చర్చించారు.