కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ
NEWS Nov 22,2024 05:20 am
సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయడానికి గురువారం మల్యాల రైతు వేదికలో ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు మల్యాల ఎంపీడీవో స్వాతి తెలిపారు. ఇప్పటివరకు మల్యాల మండలంలోని 19 గ్రామాల పరిధిలో 99% కుటుంబ సర్వే పూర్తయిందని, మిగిలిన కుటుంబాల వివరాలు సేకరించిన తర్వాత ఆన్ లైన్లో నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.