కరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు వద్ద శుక్రవారం ఉదయం రెండు లారీలు ఢీకొన్న విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. మార్బుల్స్ లోడ్, పత్తి లోడుతో వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో లారీల ముందు భాగం నుజ్జు నుజ్జునుజ్జయింది. క్యాబిన్లో ఇద్దరు డ్రైవర్లు దేవిలాల్, వీరయ్య ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీలతో అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.