రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
NEWS Nov 22,2024 09:06 am
చిట్వేలు: చిట్వేలు మండలం గట్టుమీద పల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. కట్టావారి పల్లెకు చెందిన ఇరువురు బైక్ పై వెళుతుండగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ రోడ్డు మీద కింద పడగా వెనుక వస్తున్న వాహనం మహిళ మీద ఎక్కి వెళ్ళిపోయింది. తల చిద్రమై మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.